Telangana CMO
@TelanganaCMO
Official account of CMO Telangana.
ID:2558684335
https://cm.telangana.gov.in/ 10-06-2014 09:58:50
11,4K Tweets
1,6M Followers
21 Following
ఉపాధ్యాయ వృత్తి నుంచి అంచెలంచెలుగా రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన ఆదర్శప్రాయుడు, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా మా నివాళులు Revanth Reddy 🙏
#SarvepalliRadhakrishnan
శ్రీ రామ నవమి సందర్భంగా Revanth Reddy రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారామ స్వాముల వారి ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యాన్ని దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు…
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి Revanth Reddy అన్నారు. అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని…
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల కారణంగా రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని…
రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం…
ఒక సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన మహాత్మా జ్యోతిరావ్ పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని Revanth Reddy కొనియాడారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. #jyotibaPhulejayanti పురస్కరించుకుని ఆ…
ముస్లిం సోదరులందరికీ ముఖ్యమంత్రి Revanth Reddy రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. #EidAlFitr2024 వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈ రంజాన్ పండుగను ముస్లింలందరూ తమ…
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి Revanth Reddy శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్షించారు. కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. నూతన సంవత్సరంలో…
తొలి తరం న్యూస్ రీడర్గా తెలుగు ప్రజలు అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ గారి మరణం బాధాకరమని ముఖ్యమంత్రి Revanth Reddy ఒక సందేశంలో పేర్కొన్నారు. 1983 నుంచి న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్ తనదైన ముద్ర వేసుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు…
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి Revanth Reddy కొనియాడారు. బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని బాబూజీ సేవలను ముఖ్యమంత్రి స్మ…
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడం వల్ల చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి Revanth Reddy దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న ఆయన తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి…